Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsవైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం సమీక్ష సమావేశం › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:37 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 8 💬 0
Andhra Pradesh > రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం సమీక్ష సమావేశం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం సమీక్ష సమావేశం

అమరావతి, జూలై 16
అక్షర చాతుర్య

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం సమీక్షా సమావేశం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో విశాఖపట్నం జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ పాల్గొన్నారు.

సమావేశం అనంతరం రవీంద్ర భరత్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో విశాఖ జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, బీసీ సామాజిక వర్గాల సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది.

బీసీల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయాలి:

జగన్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీల సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తోందని ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన బీసీ సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్, సనపల రవీంద్ర భరత్‌కు పలు సూచనలు చేశారు.

జగన్ ఇచ్చిన ప్రధాన సూచనలు:

బీసీల సంక్షేమం, వారి హక్కుల సాధన కోసం కూటమి ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేయాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రతి గ్రామంలోనూ బీసీల సమస్యలను ప్రజల ముందు ఉంచాలని ఆదేశించారు.

బీసీ సామాజిక వర్గాలకు వైఎస్సార్‌సీపీయే అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పించాలని దిశానిర్దేశం చేశారు.

జగన్ ఆశీస్సులతో ఉద్యమం ఉధృతం చేస్తాం

రవీంద్ర భరత్ భేటీ అనంతరం బీసీల అభివృద్ధి, సంక్షేమం అంటే వైఎస్సార్‌సీపీ పాలనే అని, గత ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వం బీసీలకు 50 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం అందించిందని గుర్తు చేశారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ అన్యాయాలపై వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. జగన్ ఇచ్చిన పిలుపుతో విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించి ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని భరత్ తెలిపారు.

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఇతర సీనియర్ నేతలు, వివిధ జిల్లాల బీసీ విభాగ అధ్యక్షులు పాల్గొన్నారు.