బంగారం ధరిస్తున్నారా ? జాగ్రత్త !
పోలీసుల హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండండి
విశాఖపట్నం మే 14
అక్షర చాతుర్య ప్రతినిధి
విశాఖపట్నం నగరంలో బుధవారం రోజున చైన్ స్నాచింగ్ ఘటనలు ఒక్కసారిగా పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బహిరంగ ప్రదేశాలు, బజార్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఒంటరిగా నడిచే మహిళలను లక్ష్యంగా చేసుకుని దుండగులు బైక్లపై వచ్చి చైన్లు లాగి పారిపోతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఒకే రోజు నగరంలోని జీవీఎంసీ, గాజువాక, మధురవాడ ప్రాంతాల్లో 4-5 ఘటనలు నమోదైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు.
ప్రజలకు పోలీసుల సూచనలు:
వరుస ఘటనల నేపథ్యంలో నగరంలోని అన్ని కీలక ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచినట్లు, సాదా దుస్తుల్లో పోలీసులు నిఘా పెట్టినట్లు డీసీపీ తెలిపారు. రాత్రి సమయాల్లో ప్రత్యేక చెకింగ్లు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తత తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు.