విశాఖపట్నం:
ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అలాగే పోలీస్ విభాగం, జీవీఎంసీ, రెవిన్యూ శాఖలకు చెందిన అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ పి. విష్ణుకుమార్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
విశాఖపట్నం నగర మేయర్ పీలా శ్రీనివాస్ రావు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ కి నూతన సంవత్సర శుభాకాం,క్షలు తెలియజేశారు.
